హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి పలు రైల్వే స్టేషన్లకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు ఈ నెల 26, 27 తేదీల్లో రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.
అలాగే హైదరాబాద్ – యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ల పరిధిలో.. రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఈ రైళ్లు ఈ నెల 29, 30 తేదీలలో రాకపోకలు కొనసాగించనున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి నాగర్సోల్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు ఈ నెల 24, 25 తేదీలలో రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. అయితే ఈ మార్గాలలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.