ఫొటొరైటఫ్: 6వైడీడీ10: యాదాద్రి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
ఫొటొరైటఫ్: 6వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో స్వామివారి అష్టోత్తర పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
యాదాద్రి: పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం స్వామి, అమ్మ వార్లకు విశేష పూజలు జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు.
ఉత్సవమూర్తులను పంచామృ తాలతో అభిషేకించి, అనంతరం తులసీ ప్రతాలతో అర్చన జరిపారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మ వారి కి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహా మండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామివారికి పవలింపు సేవను నిర్వహించారు.