అమరావతి,జూన్ 24: వీరబ్రహ్మాంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై ఏపీ దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి చర్యలు చేపట్టారు. అందుకోసం ప్రత్యేకాధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు. గడువు ఇచ్చినా బ్రహ్మంగారి వంశీకుల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రత్యేక అధికారిని నియమించారు. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.పీఠాధిపతి నియామకం, అవినీతి అక్రమాలపై ఆజాద్ చర్యలు చేపట్టారు. మఠంమేనేజర్ నెల రోజుల సెలవుపై వెళ్లారు.