కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్బషీరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు నేతలు, సంక్షేమసంఘాల ప్రతినిధులతో పాటు బీసీ కులాల ఫెడరేషన్ సభ్యులు ఎమ్మెల్యే వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలు, బస్తీలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆయా ప్రాంతాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అదే సమయంలో సంక్షేమపథకాలు అర్హులకు అందేలా కాలనీల సంక్షేమ సంఘాలు కృషి చేయాలన్నారు.