తిరుమల : తిరుమల ( Tirumala ) లో వచ్చే నెల లో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. మే 3న భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం, 4న సర్వ ఏకాదశి, 10న అక్షయతృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి, 23న అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శ్రీవారి ఆదాయం రూ. 2.88 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshanam ) కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 81,212 మంది భక్తులు దర్శించుకోగా 41,690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వార హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చిందని టీటీడీ వివరించింది .