నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ పనులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.119.41 కోట్లతో సిద్దపూర్ చెరువును రిజర్వాయర్గా నిర్మిస్తున్నారు.
ప్రతిపాదిత స్థలంలో మంత్రులు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కొద్ది సేపట్లో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. సభా ప్రాంగణంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రక్త దాన శిబిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.