లక్నో: లైంగికదాడి కేసులో యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. అతడితోపాటు మరో ఇద్దరికి కూడా ఇదే శిక్షను వేసింది. ప్రజాపతి, పలువురు కలిసి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని, తన కుమార్తెపైనా లైంగికదాడికి యత్నించారని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా, గతంలో యూపీలోని అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలో ప్రజాపతి మంత్రిగా పనిచేశారు.