Special Trains To Sabarimala | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-కొల్లం, కొల్లం-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. కాచిగూడ కొల్లం (07109) రైలు డిసెంబర్ 18, 25, జనవరి 1, 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కొల్లం నుంచి కాచిగూడకు డిసెంబర్ 20, 27, జనవరి 3, 11, 17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందని తెలిపింది. కాచిగూడ – కొల్లం రైలు ప్రతి సోమవారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30గంటలకు కొల్లం రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో అదే రోజున ఉదయం 10.45 గంటలకు బయలుదేరి గురువారం కాచిగూడకు చేరుతుంది. రైలు రెండుమార్గాల్లో ఉమ్దానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుర్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పడి, ఈరోడ్, పాల్ఘట్, ఎర్నాకులం టౌన్, కాయంకులం, తదితర రైల్వేస్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకల సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం నవంబర్ 17న తెరుచుకున్నది. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్పదీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.