దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మెన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ ఇద్దరూ ఐసీసీ చైర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐసీసీ చైర్మెన్ గ్రేగ్ బార్క్లే తన పదవీ కాలాన్ని పొడిగించేందుకు అయిష్టంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ పోస్టు ఖాళీ కానున్నది. బార్ క్లే వారసుడిగా గంగూలీ లేదా జే షా రేసులో నిలిచే అవకాశాలు ఉన్నట్లు ఓ పత్రిక కథనాన్ని రాసింది. భారత్లో 2023లో ఐసీసీ వరల్డ్కప్ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయానికి ఐసీసీ చైర్మెన్గా ఇండియన్ ఉండాలన్న అభిప్రాయం బీసీసీఐలో ఉంది. 2011లో ఇండియాలో వరల్డ్కప్ జరిగిన సమయంలో ఐసీసీ చైర్మెన్గా శరద్ పవార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.