న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే విచారణ సమయంలో కనీసం అయిదుగురు ఆఫీసర్లు ఉండనున్నారు. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి కూడా విచారణలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళా అధికారి దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఒకవేళ ప్రశ్నలు వేస్తున్న సమయంలో సోనియా అలసిపోతే, ఆమెకు రెస్ట్ ఇచ్చేందుకు కూడా ఈడీ అధికారులు ప్రిపేరయ్యారు. సోనియా తన కూతురు ప్రియాంకాతో కలిసి ఈడీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు.