వెంగళరావునగర్, జనవరి 5 : వృద్ధాప్యంలో ఉన్న అమ్మకు సాయం చేద్దామని వెళ్లిన కుమారుడు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేటలో నివాసముండే దయాసాగర్ శిరిస్వాల్ (41) జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తుండేవాడు. మూగవాడైన దయాసాగర్ ఇంటి సమీపంలోనే అతడి తల్లి చంద్రవతి శిరిస్వాల్ నివాసముంటుంది.
వయోభారంతో ఇంటి పనులు చేసుకోలేకపోతున్న తల్లికి సాయపడేందుకు వెళ్లిన దయాసాగర్ ఇంట్లోని విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెనక్కి పడటంతో తలకు తీవ్రగాయమై మృతి చెందాడు. మృతుడి భార్య కూడా మూగదేనని.. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.