హిమాయత్నగర్, నవంబర్ 23: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు, వైద్య కళాశాల్లో పని చేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావును తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి బృందం ఆయన నివాసంలో కలిసి వినతి ప్రతాన్ని అందజేసింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీంరావు మాట్లాడుతూ దవాఖానలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యో గాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేసేందుకు చొరవ చూపాలని కోరారు. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించి కొత్త పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీష్రావు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ నాయకులు యంసీఎస్ రాజు, యం.యాదయ్య, వి.వేణు కుమార్, వెంకట్రావు, ఈరోజి, ఇందిరాశ్రీలక్ష్మి, మధుసూదన్రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, సంతోష్ కుమార్ ఉన్నారు.