శాసన మండలి చైర్మన్గా రెండోసారి నియామకమై ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం తొలిసారిగా నల్లగొండకు రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డితోపాటు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ, మార్చి 16 : శాసన మండలి చైర్మన్గా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం తొలి సారిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి రావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, మొక్కలు, బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ యంత్రాంగం గౌరవవందనం చేశారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు ఎస్పీ రెమా రాజేశ్వరి గుత్తాకు స్వాగతం పలికి బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి జడ్పీ ఉద్యోగులతో కలిసి గుత్తాను సన్మానించారు. టీఎన్జీఓస్తో పాటు టీజీఓల సంఘం నేతలు మంత్రవాది శ్రవణ్ కుమార్, కిరణ్ కుమార్ గుత్తాను శాలువా కప్పి సన్మానించారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, మిర్యాలగూడ జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, ఉద్యోగుల సంఘం నేతలు ఏపాల సత్యనారాయణరెడ్డి, కొప్పు రాంబాబు, బీసీ సంఘం నేతలు, లయన్స్ క్లబ్ నేతలు గుత్తాను వేర్వేరుగా కలిసి సన్మానించారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారికి గుత్తా సుఖేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.