హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా కమలాపూర్ మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం సోమవారం కమలాపూర్ పట్టణంలోజరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో విపక్షాల విష ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో వారియర్స్కు బాల్కసుమన్ దిశానిర్దేశం చేశారు.