లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో శుక్రవారం స్నానాలకు చేసేందుకు వెళ్లి ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గల్లంతయ్యారని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్కుమార్ పేర్కొన్నారు. ఆగ్రాకు జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన 15 మంది అయోధ్యకు వచ్చారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం గుప్తార్ ఘాట్ వద్ద వారంతా స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. ఆరుగురిని కాపాడగా.. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురిని రక్షించారు. నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందగా.. మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదని, వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.