కన్నూర్, ఏప్రిల్ 6: బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కేరళలోని కన్నూరులో బుధవారం మొదలైన సీపీఎం 23వ మహాసభల్లో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను అధిగమించేందుకు వామపక్షాలు కలిసి నడవాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తిచేశారు.