ముంబై: పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశారు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి బీసీసీఐ మెడికల్ బృందం చికిత్సను అందిస్తోంది. అయితే కీలకమైన వరల్డ్కప్ సమయంలో బుమ్రా గాయపడడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్కప్ జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో బుమ్రా ఆడలేదు. ఇక మిగిలిన రెండు టీ20లకు అతని స్థానంలో హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్ను ఎంపిక చేశారు.