లక్నో: సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సింధు 21-16, 21-13 అమెరికా ప్లేయర్ లారెన్ లామ్పై అద్భుత విజయం సాధించింది. రెండు గేమ్ల్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన తెలుగమ్మాయి 33 నిమిషాల్లోనే ప్రిక్వార్టర్స్ పోరును ముగించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 21-11, 16-21, 21-18 భారత్కే చెందిన ప్రియాంశు రజావత్పై నెగ్గి ముందంజ వేశాడు. ఈ యువ షట్లర్ క్వార్టర్స్లో మెర్కెలెతో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్లో హైదరాబాదీ షట్లర్ సామియా ఇమాద్ ఫారుఖీ 21-6, 21-15తో కనికా కన్వాల్పై అలవోక విజయం సాధించి..అనుపమ ఉపాధ్యాయతో పోరుకు సిద్ధమైంది. పురుషుల డబుల్స్లో నాలుగో సీడ్ ఎమ్ఆర్ అర్జున్, ధృవ్ కపిలా జోడీ క్వార్టర్స్లోకి ప్రవేశించింది.