లక్నో: సయ్యద్మోదీ ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రత్యర్థి ఐదో సీడ్ ఎవ్జినియా కోత్సెకయ(రష్యా) రిటైర్డ్ హార్ట్ కావడంతో టాప్ సీడ్ సింధు నేరుగా తుది పోరుకు చేరుకుంది. అంతకుముందు సింధు తొలి గేమ్లో 21-11తో రష్యా ప్లేయర్పై ఆధిక్యం ప్రదర్శించింది. రెండో గేమ్లోనూ దూకుడు కనబరిచే సమయంలో ప్రత్యర్థి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. మరో సెమీస్లో అనుపమ ఉపాధ్యాయపై 19-21, 21-19, 21-7తో గెలిచిన మాళవికా బన్సోద్తో సింధు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇద్దరు భారతీయుల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగనుంది. రెండున్నరేండ్లుగా అందని ద్రాక్షగా ఉన్న అంతర్జాతీయ టైటిల్ను ఈ టోర్నీతో దక్కించుకోవాలని సింధు చూస్తుండగా.. సీనియర్ ప్లేయర్పై అదృష్టం పరీక్షించుకునేందుకు మాళవిక సై అంటున్నది. పురుషుల డబుల్స్ సెమీస్లో నెగ్గిన కృష్ణప్రసాద్- విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఫైనల్కు చేరింది. మరో పోరులో ధ్రువ్ కపిల-అర్జున్ జోడీని ఓడించిన వే చుంగ్- కై వాన్ తీ ద్వయంతో కృష్ణ-విష్ణు జంట తుదిపోరులో తలపడనుంది.