బెజ్జంకి, జనవరి 18 : ‘సర్.. నా సైకిల్ పోయింది.. ఊరికి వెళ్లి వచ్చే సరికి కనిపిస్తలేదు.. వెతికి పెట్టండి’.. అని ఓ 11 ఏండ్ల బాలుడు ఠాణా మెట్లు ఎక్కాడు. బాలుడి ధైర్యాన్ని చూసి, ఎస్సై మెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోనగిరి అశోక్ కుటుంబంతో కలిసి మండల కేంద్రంలో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ కోసం కుటుంబంతో సహా ఊరెళ్లి వచ్చారు. రాగానే ఇంటి ముందు పెట్టి వెళ్లిన సైకిల్ కనబడకపోవడంతో అతని కొడుకు సాత్విక్ హైరానాకు గురయ్యాడు. తాను ఆడుకునే సైకిల్ దొంగతనానికి గురైందని భావించాడు.
మంగళవారం నేరుగా బెజ్జంకి పోలీస్స్టేషన్కు వెళ్లాడు. తన సైకిల్ పోయిందని ఎస్సై తిరుపతితో వాపోయాడు. అతని మాటలు విన్న అనంతరం ఎస్సై, తండ్రి అశోక్ను అడుగగా, సాత్విక్ ఎక్కువ సమ యం సైకిల్తోనే గడుపుతుండడంతో తామే దాచి పెట్టామని చెప్పా డు. అనంతరం బాలుడిని తండ్రి వచ్చి అతనిని తీసుకెళ్లాడు. సాత్వి క్ ధైర్యాన్ని ఎస్సై అభినందించారు. ఎవరికైనా సమస్యలు వస్తే నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.