ప్రశాంత్నగర్, మార్చి 10 : సిద్దిపేట పట్టణం ఐదేండ్లలో అభివృద్ధి సాధించిన తీరు అద్భుతంగా ఉన్నది.. సీఎం కేసీఆర్, హరీశ్రావు లాంటి నాయకులు ఉండడం మనకు గర్వకారణం.. సిద్దిపేట అభివృద్ధిని చూస్తే నేను సిద్దిపేట వాసిని కావడం సగర్వంగా ఉందన్నారు. సిద్దిపేట మరో డల్లాస్ కావాలని కోరుకుంటున్నానని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మం త్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు అమెరికా నుంచి వచ్చిన సిద్దిపేట వాసి సాయికృష్ణ.. ఐదేండ్ల తర్వాత నేను సిద్దిపేటకు వచ్చాను. చూసి ఆశ్చర్యపోయాననని అమెరికాలో ఉద్యోగం చేస్తూ బుధవారం సిద్దిపేటలో మేనమామ ఇంటికి వచ్చిన సాయికృష్ణ తెలిపారు. మేనమామతో కలిసి కోమటి చెరువును సందర్శించారు.
మంత్రి హరీశ్రావు లాంటి నాయకుడు ఉండడం మనందరికీ అదృష్టంగా భావించాలన్నారు. సిద్దిపేటలో ఉన్నామా.. సిడ్నీలో ఉన్నామా అనే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేశారన్నారు. ప్రపంచ పటంలో సిద్దిపేట చూపించే ప్రగతి కనబడుతుందన్నారు. ముఖ్యంగా కోమటి చెరువు వద్ద నైట్ గార్డెన్ పార్కు, రూబీ నెక్లెస్ రోడ్, సస్పెన్షన్ బ్రిడ్జి చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. గతంతో పోలిస్తే నేడు పట్టణంలో అద్భుతమైన అభివృద్ధి ఉందన్నారు. మంత్రి హరీశ్రావు డైనమిక్ నాయకత్వంలో కొన్ని రోజుల్లోనే భారీ మార్పును తీసుకువచ్చారన్నారు. సిద్దిపేటను మరో డల్లాస్గా అభివృద్ధి చేస్తారని.. నాకు నమ్మకం ఉందంటూ.. ట్విట్టర్లో సాయికృష్ణ, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.