సిద్దిపేట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మెదక్: పారదర్శకంగా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై బుధవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఉన్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, నవంబర్ 16న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. నవంబర్ 16 నుంచి 23 వర కు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 లోపు నామినేషన్ల ఉ పసంహరణ గడువు ముగుస్తుందని, డి సెంబర్ 10న పోలిం గ్, 14న కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని, వీరు మిగిలిన కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా ని యమావళి అమలులోకి వస్తుందని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, వ్యవహరిస్తారని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు అనువైన కేంద్రాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.
జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులో సమావేశం ఏర్పాటు..
ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు జిల్లాల వారీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితా పంపాలని అధికారులకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్గోయల్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో నిర్వహిస్తామని, బ్యా లెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మి నహా అన్ని జిల్లాలో ప కడ్బందీగా ఎన్నికల ప్ర వర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిష న్ మారదర్శకాలను జారీ చేసిందని, వాటిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ స మయంలోనూ అమలు చేయాలని ఆయన తె లిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గం టల వరకు ప్రచారం నిర్వహించాలని, అంత ర్గ సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్ర దేశాలకు 500 మంది కంటే అధికంగా ప్రజ లు హాజరు కావద్దని, బైక్ ర్యాలీలు, కార్ల ర్యా లీలకు అనుమతి ఉండదని, ఇంటింటా క్యాం పెయిన్ ఐదుగురు, వీడియో వ్యాన్ క్యాంపెయిన్ 50 మంది, 72 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని అధికారులకు సూ చించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమయంలో ఎన్నికల ప్ర వర్తనా నియమావళి, కరోనా మార్గదర్శకాలపై అవగాహన క ల్పించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల సమయంలో నియమాలను పాటి స్తూ ప్రచారం చేసుకునేలా వారికి ముందస్తుగా అనుమతులు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మోడల్ కోడ్ పాటించేలా చూడాలి
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా మొత్తం 258మంది ఉంటారన్నా రు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు ఆర్డీవో, ము న్సిపల్ కమిషనర్లు, పోలీసు అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ ప్రపుల్దేశాయ్, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు రమణాచారి, గోపాల్, గణేశ్, ఏసీపీ మహేందర్, జడ్పీ సీఈవో, డీపీవో, ఎన్నికల డీటీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, ఆర్డీవో సాయిరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.