ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ప్రభుత్వ సహకారంతో రోజురోజుకూ చిత్ర పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో అగ్ర హీరో పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సుస్థిరమైన కేంద్రంగా మారింది. మా ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటున్నది. ఇక్కడ పరిశ్రమ రోజు రోజుకూ మరింత అభివృద్ధి చెందుతోంది. ఇందుకు పవన్ కళ్యాణ్ లాంటి నటుల సహకారం అవసరం. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన 50 టీఎంసీల సామర్థ్యమున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్కు ప్రారంభోత్సవం చేశారు. గోదారమ్మకు భూదారి చూపించిన కేసీఆర్ గారికి మనమంతా శుభాకాంక్షలు తెలియజేద్దాం. నేను పవన్ కళ్యాణ్ అన్నకు చెబుతున్నా..మీరు సినిమా షూటింగ్లు గోదావరి జిల్లాల్లో చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కాళేశ్వరం పుణ్యంకొద్దీ మలన్నసాగర్లో, కొండపోచమ్మ సాగర్లోనూ చేసుకోవచ్చు. గోదావరి జలాలను 82 మీటర్ల ఎత్తు నుంచి 612 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నర ఏళ్లలో పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్గారిది. మీరు చేసే షూటింగ్లతో తెలంగాణ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందాలని కోరుకుంటున్నా. భీమ్లా నాయక్ చిత్రం ద్వారా పద్మశ్రీ మొగిలయ్య, దుర్గాభాయ్ లాంటి అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తీసుకొచ్చినందుకు పవన్ తో పాటు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు ఒక మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్ సోదరుడిగా, వారి ఆహ్వానం మీద వచ్చాను. ఒక మంచి మనిషి, ఒక విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్. మేమంతా మీ తొలిప్రేమ సినిమా చూసిన వాళ్లమే కాలేజీలో. ఇరవై ఆరేళ్లపాటు ఒకేరకమైన స్టార్డమ్ను, ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం అసాధారణ విజయం. కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ చిత్రబృందం అందరికీ నమస్కారాలు.
సోదరులు కల్వకుంట్ల తారక రామారావుని, ఆప్యాయంగా రామ్ భాయ్ అని పిలుస్తాను. మేము ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చినందుకు చిత్రబృందం తరుపున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్గారి నాయకత్వంలో తెలుగు చిత్రపరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎంతో తోడ్పాడు లభిస్తున్నది. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. చిన్నపాటి అవసరం కలిగినా మాట్లాడి పరిష్కరించే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. నిజమైన కళాకారుడికి కులం, మతం ప్రాంతం అనే బేధాలు ఉండవు. జనజీవితంలో ఉన్నా సినిమా నాకు అన్నం పెట్టింది. సినిమా లేకుంటే నేను ప్రజాజీవితంలో ఉండే అవకాశం ఉండేది కాదేమో. భీమ్లానాయక్ మిమ్మల్ని అలరిస్తుంది’ అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమ దేశానికి సినిమా హబ్ గా ఉండాలని కృషి చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలను పరిష్కరిస్తున్నాం. సింగిల్ విండో అనుమతులు, టికెట్ రేట్లు, ఐదో ఆటకు పర్మిషన్స్..ఇలా అన్ని విషయాల్లో సీఎం ఆదేశాలతో, కేటీఆర్ మార్గదర్శనంలో బ్రహ్మాండంగా చర్యలు తీసుకుంటున్నాం. చిత్ర పరిశ్రమ బాగుండాలని, ఇక్కడి 24 విభాగాల కార్మికులు బాగుండాలనేదే మా ప్రభుత్వ కోరిక.
‘పవన్ కళ్యాణ్ గారి పంజా ఆడియో కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్తే వీలు కాలేదు. ఆ స్థాయి నుంచి ఇవాళ ఆయన సినిమాకు దర్శకత్వం వహించే స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, నాయికలు నిత్యామీనన్, సంయుక్త మీనన్, సంగీత దర్శకుడు థమన్, కిన్నెర గాయకుడు పద్మశ్రీ మొగిలయ్య గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, నిర్మాతలు నాగవంశీ, రాధాకృష్ణ, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందించారు. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, మాటలు అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.