మహదేవపూర్, అక్టోబర్ ౨౮: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి పరిధిలోని లక్ష్మి బరాజ్కు ౩ కిలోమీటర్ల దూరంలో గురువారం పులి దాడి చేయగా ఓ పశువుల కాపరి మృతి చెందాడు. మహదేవపూర్ మండల సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పెంటిపాక గ్రామ సమీప అడవిలో గొర్లు, మేకలు మేపడానికి వెళ్లిన ఇద్దరిపై పులి అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో పశువు కాపరి దుర్గం మల్లయ్య (౫౦) అక్కడికక్కడే చనిపోగా, మరో వ్యక్తి ప్రాణాలతో తప్పించుకున్నాడు. అలాగే పులి పశువులపై సైతం దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.