న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడు మంది భారతీయ సైనికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆర్మీ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పెట్రోలింగ్ బృందానికి చెందిన సైనికులు ఆ కొండచరియల్లో చిక్కుకున్నారు. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు. హై ఆల్టిట్యూడ్ లో ఉన్న కీమెంగ్ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి వాతావరణం ప్రతికూలంగా ఉంది. అక్కడ భారీ స్నో పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో మంచుచరియలు విరిగిపడుతున్నాయి.