పుణె: భారతదేశం బయట కోవిషీల్డ్ను ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) యోచిస్తున్నది. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ముడి పదార్థాల సరఫరాలో సమస్యల కారణంగా కంపెనీ ఈ విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఎస్ఐఐ సీఈఓ అదార్ పూనావాలా ఒక వార్తాపత్రికతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పినట్లు వార్తా కథనం. సీరం ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా కోవ్షీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్నది.
భారతదేశం వెలుపల ఉత్పత్తిని త్వరలో ప్రకటించవచ్చని అదార్ పూనావాలా చెప్పారు. సీరం ఇన్స్టిట్యూట్ జూలై తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని 100 మిలియన్ డోసులకు పెంచనున్నట్టు పూనావాలా గత వారం చెప్పారు. అంతకుముందు మే చివరి కల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టైమ్ లైన్ను నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలు కోవిడ్ వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి.
సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం 6 నెలల్లో ఏటా 2.5 బిలియన్ల నుంచి 3 బిలియన్ డోసులకు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు అదార్ పూనావాలా చెప్పారు. భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులను నిషేధించడానికి ముందే తాను లండన్ చేరుకున్నానన్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆక్సిజన్, మందులు, ఇతర అవసరమైన పరికరాలు కొరతగా మారాయి. ప్రభుత్వం ఈ వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం చాలా అవసరం. ఈ వారం రోజుల్లో దేశంలో కరోనావైరస్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం: కేవైసీ అందించేందుకు బ్రాంచీలకు రమ్మనొద్దు
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఎలోన్ మస్క్తో నాసా ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్లో కారు బాంబు పేలుడు.. 30 మంది దుర్మరణం
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..