సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) రెండో కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవావ్యాక్స్’ కోసం భారత్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలో కోవావ్యాక్స్ ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీరమ్ సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ప్రస్తుతం సీరమ్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్కు భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.
దేశంలో కరోనా వైరస్ టీకా డ్రైవ్లో భాగంగా రెండు వ్యాక్సిన్లను వేస్తున్నారు. కోవిషీల్డ్ తో పాటు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాలను భారతీయులకు వేస్తున్నారు.
సెప్టెంబరు నాటికి కోవావ్యాక్స్ ను ప్రారంభించాలని కంపెనీ భావిస్తున్నట్లు ఆధార్ పూనావాలా శనివారం తెలిపారు. 2020 ఆగస్టులో అమెరికన్ టీకా కంపెనీ నోవావాక్స్ తో సీరమ్ ఒప్పందం చేసుకుంది. నోవావాక్స్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా NVX-CoV2373 ఉత్పత్తి, పంపిణీ కోసం సీరమ్తో లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్తో పాటు పేద దేశాల్లో టీకాలను సరఫరా చేయనున్నారు.