చండీగఢ్, ఫిబ్రవరి 6: పంజాబ్లో తమ సీఎం అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీనే అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. లూథియానాలో ఆదివారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ ఈ ప్రకటన చేశారు. ‘నిజమైన నాయకులు 10-15 రోజుల్లోనే పుట్టరు. ఏండ్ల తరబడి కష్టపడితేనే నాయకులుగా ఎదుగుతారు’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చన్నీ, సిద్దూ ఇద్దరి రక్తంలో పంజాబ్ ఉందన్నారు. తనను సీఎం అభ్యర్థిగా ఎంచుకోవడంపై చన్నీ కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను పదవుల కోసం జీవించడం లేదని, పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని సిద్దూ తెలిపారు.