బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుని స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వారి తీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బలం లేకున్నా కాంగ్రెస్ బరిలో నిలిచిందన్నారు. ఆ పార్టీకి వెనక నుంచి బీజేపీ మద్దతు తెలుపుతున్నదని ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చిందన్నారు. నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైద్యుడు, రాజకీయ నాయకుడిగా నిస్వార్థంగా సేవలందిస్తున్న యాదవరెడ్డిని గెలిపించాలని కోరారు. కేంద్రం అన్ని ధరలు పెంచుతూ పేదలపై భారం మోపుతోందన్నారు.
ఎంపీటీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే గౌరవం పెంచింది..
పటాన్చెరు, నవంబర్ 26 : మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బలం లేకుండా కాంగ్రెస్ బరిలో నిలిచిందని, కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డిలతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డిని స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కోసం ఏడేండ్లుగా నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తి అని ఆయన్ని కొనియాడారు. పార్టీలో ఏ పదవి ఆశించకుండా సీఎం కేసీఆర్ను గజ్వేల్లో గెలిపించేందుకు కృషిచేశారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డిని సైతం పార్టీ గౌరవించిందన్నారు. ఇప్పుడు కూడా గౌరవం పెంచేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కుమ్ముక్కై ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలిపాయని ఆరోపించారు. మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నా, వారు మాత్రం స్వార్థ రాజకీయాలతో బరిలో నిల్చున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ధరలు పెంచుతూ పేదలపై భారం మోపిందన్నారు. త్వరలోనే గ్యాస్బండ రూ.1200 చేయబోతున్నదని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచిన చరిత్ర టీఆర్ఎస్కే ఉందని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులతో పాటు గౌరవ ప్రజాప్రతినిధులకు వేతనాలు 30శాతం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కౌన్సిలర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచినా, ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యంగా అందుకుంటారన్నారు. బీజేపీ చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు మీ ఓట్లకోసం తప్పుడు వాగ్ధ్దానాలు చేసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా యాదవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కోరారు. యాదవరెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో డాక్టర్, ప్రజాసేవకుడి నిస్వార్థ సేవలు అందించారని గుర్తుచేశారు. గజ్వేల్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ఏజెంట్గాను సేవలు అందించారన్నారు.
పటాన్చెరు అభివృద్ధికి చిరునామాగా నిలిపాం..
పటాన్చెరును అభివృద్ధ్దికి చిరునామాగా నిలిపామని మంత్రి హరీశ్రావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరులో అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయిన వెంటనే పటాన్చెరు నియోజకవర్గానికి మంజూరైన 150 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే తన వద్దకు వచ్చి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు మహిపాల్రెడ్డి అని గుర్తించాలన్నారు. త్వరలోనే పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తాగునీటిని అందజేసేందుకు రూ.250కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మీ వార్డుల్లో ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. వందశాతం వాక్సినేషన్ వేస్తేనే మనకు కరోనా నుంచి రక్షణ ఉంటుందని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ వేసే విధానంపై అందరికీ శిక్షణ ఇస్తామన్నారు. పార్టీ ఎలా ఆదేశిస్తే అందరు అదే ఆచరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్, ప్రవీణ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశంగౌడ్, శ్రీధర్చారి, చంద్రారెడ్డి, సోమిరెడ్డి, తొంట అంజయ్యయాదవ్, ఆదర్శ్రెడ్డి, విజయ్కుమార్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొలన్ రోజాబాల్రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, లలితా సోమిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, నర్సింహాగౌడ్, మన్నెరాజు, నాగజ్యోతి లక్ష్మణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటా : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి
టీఆర్ఎస్ పార్టీ ఎలా ఆదేశిస్తే అలా క్రమశిక్షణ కల్గిన సైనికుడిలా పనిచేశానని ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి అన్నారు. తాను డాక్టర్గా 1983 నుంచి ప్రాక్ట్టీసు చేస్తున్నానని చెప్పారు. 1985లో సర్పంచ్, ఆ తర్వాత గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా సేవలందించానన్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ బరిలో నిలువగా, ఆయన విజయం కోసం పనిచేశానన్నారు. 30 ఏండ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే మీ వాణిగా శాసనమండలిలో ఉంటానని అన్నారు.
యాదవరెడ్డిని గెలిపించుకుందాం
ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. యాదవరెడ్డి గజ్వేల్ ప్రాంతంలో డాక్టర్, ప్రజాసేవకుడిగా మంచి పేరున్న వ్యక్తి అని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేస్తున్న యాదవరెడ్డిని పటాన్చెరు నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు గెలిపించాలని కోరారు.
: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
వందశాతం ఓట్లు వేస్తాం
పటాన్చెరు నియోజకవర్గంలో 70 ఓట్లు ఉన్నాయని, వాటిని నూటికి నూరుశాతం యాదవరెడ్డికి వేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మంత్రి హరీశ్రావుకు హామీ ఇచ్చారు. వాటితో పాటు మరికొందరు ఇండిపెండెంట్ల ఓట్లను కూడా యాదవరెడ్డికి వేయిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి