సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఇద్దురు వ్యక్తులు వైజాగ్ నుంచి హైదరాబాద్కు కారులో 240 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. కాగా, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
పసిగట్టిన స్మగ్లర్లు కారును తిప్పుకుని సూర్యాపేట వైపు మళ్లించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు గమనించి వారిని వెంబడించారు. స్మగ్లర్లు టాస్క్ఫోర్స్ పోలీసుల నుంచి తప్పించుకుని సూర్యాపేటకు వస్తూ మార్గమధ్యంలో టేకుమట్ల నుంచి అర్వపల్లి వైపు కారును మళ్లించారు.
స్మగ్లర్లు తెలివిగా అర్వపల్లి రాకుండా మధ్యలో లోపలికి ఉన్న సోలిపేట గ్రామంలోకి వెళ్లి పాఠశాల వెనుక చెట్లల్లో కారును ఆపి తాళాలు వేశారు. అక్కడ స్మగ్లర్లు పోలీసులు కంటపడడంతో పరుగులు తీశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. గంజాయిని, కారును స్వాధీనం చేసుకొని సూర్యాపేట రూరల్ పోలీసులకు అప్పగించారు.