జోగులాంబ గద్వాల : తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు 14 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని హిందూపూర్ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న 148 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 7.75 కోట్లని పోలీసులు తెలిపారు. బిల్లులు లేకుండా తరలిస్తున్న ఈ బంగారం పొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి రాతిమిద్దె రాజాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు కర్నూలు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.