కమ్మర్పల్లి : దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భవానిమాతల సందడి మొదలయ్యింది. జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన దేవీ భక్తుడు వడ్ల శ్రీనివాస్ రూ.2.50 లక్షల సొంత ఖర్చుతో తమిళనాడులోని శేలం గ్రామంలో సీమ చింత చెక్కతో దేవీ విగ్రహాన్నితయారు చేయించాడు. గురువారం గ్రామస్తులు, దుర్గా యూత్ సభ్యులతో కలిసి శోభాయాత్ర నిర్వహించి తన ఇంటి సమీపంలో లలితా పరమేశ్వరి ఆలయంలో విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో, ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టాపన నిర్వహించాడు.
నవరాత్రులు తొలి రోజైన గురువారం బాల త్రిపుర సుందరి(శైల పుత్రి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు.