కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న క్యాంపుపై భద్రతా దళాలు బుధవారం దాడులు నిర్వహించి ధ్వంసం చేశాయి. నారాయణ్పూర్ జిల్లా ఓర్చా పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు క్యాంపు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు క్యాంపుపై దాడి చేసి పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, ఎలక్ట్రిక్ వైర్లతోపాటు ఇతర వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.