ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 22 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 8 మంది దివ్యాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా త్రీవీలర్ స్కూటీలను అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు స్వాంతన చేకూర్చేలా రూ.3వేల పెన్షన్ అందించి మనోధైర్యం నింపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మామిండ్ల తిరుపతిబాబు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.