న్యూఢిల్లీ, జనవరి 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానికి కోర్టు అంగీకరించింది.
కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఏప్రిల్లోగా సమాధానమివ్వాలని కోరింది.