హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): పెగాసస్ స్పైవేర్తో రాజ్యాగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కులను కేంద్రం ఉల్లంఘించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ వేసి 8 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించడంపై హర్షం వ్యక్తంచేశారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. పెగాసస్తో ప్రజల గోప్యతను ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. నిపుణుల కమిటీ విచారణను వేగంగా పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు.