Debit Card Charges | ముంబై, మార్చి 27: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆయా రకాల డెబిట్ కార్డులను ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎస్బీఐ అందిస్తుండగా, వీటిపై చార్జీని మరో రూ.75 పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనం. బ్యాంక్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్, యువ, గోల్డ్, కాంబో, ప్లాటినమ్ తదితర డెబిట్ కార్డుల చార్జీలు వచ్చే నెల 1 నుంచి పెరుగబోతున్నాయి. కాగా, కొత్త కార్డుల జారీతోపాటు ఇప్పటికే ఉన్న డెబిట్ కార్డుల స్థానంలో మరో డెబిట్ కార్డు ఇచ్చేందుకున్న చార్జీలనూ బ్యాంక్ పెంచుతున్నది.
కొత్త చార్జీలు ఇలా..
క్రెడిట్ కార్డులపై..
కొన్ని క్రెడిట్ కార్డులతో చేసే అద్దె చెల్లింపులపై అక్రూవల్ రివార్డ్ పాయింట్లను తొలగిస్తున్నట్టు ఎస్బీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. అలాగే ఆయా క్రెడిట్ కార్డులతో చేసే అద్దె చెల్లింపులపై ఇప్పటిదాకా ఉన్న అక్యుములేషన్ రివార్డ్ పాయింట్లనూ తీసేస్తున్నట్టు బ్యాంక్ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుంది.