న్యూఢిల్లీ: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయి. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ప్రకటించింది. ఈ మేరకు తన వినియోగదారులను ట్విటర్ ద్వారా అప్రమత్తం చేసింది.
— State Bank of India (@TheOfficialSBI) April 1, 2022
సాధారణంగా ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో గతేడాదికి సంబంధించిన లావాదేవీలను బ్యాంకులు క్లోజ్ చేయడంతోపాటు, కార్యకలాపాలను కొత్తగా ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 31న, ఏప్రిల్ 1న వినియోగదారులకు బ్యాంకులు నేరుగా ఎలాంటి సేవలను అందించని విషయం తెలిసిందే.