న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును 5.10 శాతం నుంచి 5.20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. రెండేండ్ల కంటే అధిక కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు వర్తించనున్నది. ఈ నూతన వడ్డీరేటు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 2-3 ఏండ్లలోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5.10 శాతం నుంచి 5.20 శాతానికి సవరించిన బ్యాంక్… 2-5 ఏండ్లలోపు డిపాజిట్లపై కూడా 5.30 శాతం నుంచి 5.45 శాతానికి సవరించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీరేటు వర్తించనున్నది.