ముంబై, ఫిబ్రవరి 3: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.15,477 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.14,205 కోట్ల లాభంతో పోలిస్తే 62 శాతం అధికమని పేర్కొంది. ఏడాది క్రితం రూ.78,351 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.98,084 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.20,839 కోట్ల నుంచి రూ.24,317 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,586 కోట్ల నిధులను వెచ్చించింది. అలాగే స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.14 శాతానికి తగ్గాయి.