బెంగళూరు, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన యాడ్ వివాదాస్పదమైంది. అందులో మాజీ ప్రధాని నెహ్రూ ఫొటోను విస్మరించి.. ఆరెస్సెస్కు చెందిన సావర్కర్ ఫొటోను సర్కారు ముద్రించింది. ఫొటో కింద ‘రెవల్యూషనరీ (విప్లవ) సావర్కర్’ అని పేర్కొన్నది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఇది బీజేపీ ప్రభుత్వ రాజకీయ దురుద్దేశమని, ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి అవమానమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్కొన్నారు.