న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత జోడి అదరగొట్టింది. పురుషుల డబుల్స్ ఈవెంట్లో చిరాగ్ శెట్టి-సాత్విక్సాయిరాజ్ జోడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. వరల్డ్ చాంపియన్షిప్లో డబుల్స్ జోడికి పతకం దక్కడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్లో మలేషియా జంట ఆరన్ చియా-సోమ్ వూ యిక్లు 22-20, 18-21, 16-21 స్కోర్తో ఇండియన్ జోడిపై గెలుపొందారు. 76 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో మలేషియా జోడి కీలక దశలో పైచేయి సాధించింది. తొలి గేమ్లో ఇండియన్ జంట థ్రిల్లింగ్ రీతిలో నెగ్గినా.. ఆ తర్వాత రెండు గేమ్లను కోల్పోయింది. వాస్తవానికి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో సెమీస్కు వెళ్లిన తొలి భారతీయ జోడిగా చిరాగ్-సాత్విక్ జంట రికార్డు క్రియేట్ చేసింది. 2011లో మహిళల డబుల్స్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప జోడి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది.