కల్లూరు/ పెనుబల్లి, జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలోనే తండాలకు నవశకం మొదలైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే తండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో శనివారం జరిగిన గిరిజన దినోత్సవాలకు ఆయన హాజరయ్యారు. కల్లూరు మండలం ఓబుల్రావు బంజరలో ఎమ్మెల్యే సండ్రకు మహిళలు, గ్రామస్తులు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలు, కోలాట నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామాన్నంతా కొబ్బరి తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శతాబ్ద కాలంలో గిరిజనులకు జరగని అభివృద్ధిని దశాబ్ద కాలంలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని గుర్తుచేశారు.
తండాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు హైదరాబాద్లోనూ ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన సీఎం కేసీఆర్కు గిరిజనులంతా బాసటగా నిలవాలని కోరారు. అనంతరం లంబాడీల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సూర్యనారాయణ, బాబ్జీ ప్రసాద్, రవికుమార్, రూప, రఘు, వీరాస్వామి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వనమా వాసు, బీరవల్లి రఘు, కట్టా అజయ్కుమార్, పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, మాన్సింగ్, రావి సూర్యనారాయణ, గంగవరపు వెంకటేశ్వరరావు, ప్రసాద్, కృష్ణ, పద్మావతి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, రామూనాయక్, అర్లప్ప, సామేలు, కృష్ణ, వీరయ్య, భద్యా తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీలకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మండలంలోని పార్థసారథిపురంలో శనివారం నిర్వహించిన గిరిజన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అనంతరం పంచాయతీ కార్యాలయం, కమ్యునిటీహాల్ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, చెక్కిలాల మోహన్రావు, కుంజా సామ్రాజ్యం, చెరుపల్లి జ్యోతి, కావూరి మహాలక్ష్మి, ఎం.రమాదేవి, వాసు, కనగాల వెంకట్రావు, తావునాయక్, రాంబాబు, పంతులి, అశోక్కుమార్, రమణ, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, వీరభద్రరెడ్డి, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.