హోం మంత్రి మహమ్మూద్అలీ
రవీంద్రభారతి, నవంబర్ 30: ప్రతి ఒక్కరు సమాజ సేవకు అంకితం కావాలని, సమాజ సేవతోనే మనిషికి తృప్తి కలుగుతుందని హోం మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్కు ఫ్రంట్లైన్ పాండమిక్ వారియర్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కరోనా సమయంలో డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు చేశారని ఆయన కొనియాడారు. మానవ సేవయే మాధవ సేవ అని, అలాంటి వారికి బియాండ్ లైఫ్ పౌండేషన్ సంస్థ వారు పాండమిక్ వారియర్స్ అవార్డులు అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ఫ్రంట్లైన్ వారియర్స్కు అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు పొంది న వారిలో సమాజ సేవకుడు డాక్టర్ మోహన్, పోలీస్ అధికారులు, ఫొటో జర్నలిస్టులు ఉన్నారు. కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.