మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకుడు. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా 2022 ఏప్రిల్ 1న విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అగ్ర చిత్రాల మధ్య పోటీని నివారిస్తూ వసూళ్లు, థియేటర్స్ పరంగా అందరికీ లాభదాయకంగా ఉండాలనే ఆలోచనతో సినిమాను ఉగాదికి వాయిదావేసినట్లు తెలిసింది. ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ పూర్తయింది. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కుతున్నది.