నవాబుపేట, డిసెంబర్ 5: పల్లె ప్రగతి కార్యక్రమంలో దాతాపూర్ గ్రామం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజ లు తమ గ్రామాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుంటే మంచి గ్రామీణ పరివర్తన సాధించవచ్చు అన్న సీఎం కేసీఆర్ సూచనలకు దాతాపూర్ గ్రామ ప్రజలు జై కొడుతున్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పాడుబడిన ఇండ్లను కూల్చివేశారు. పాడుబడిన బావులను పూడ్చివేశారు. పంచాయతీ అవసరాలకు కొత్తగా రూ6.31లక్షలతో ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశా రు. గ్రామంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ డ్రైనేజీ పూర్తి పనులు అయ్యాయి. రూ.12 లక్షల ఉపాధిహామీ పథకం నిధులతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. రూ.2.5 లక్షలతో కంపోస్టుయార్డును నిర్మించారు. కంపోస్టుయార్డులో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు కృషిచేస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నిత్యం చెత్తను సేకరించి కంపోస్టుయార్డుకు తరలిస్తున్నారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాలు డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో వివిధ రకాల పండ్లు, పూలు, డిజైన్ మొక్కలను పెంచుతున్నారు.గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీలో వివిధ రకాలకు చెందిన 45 వేలమొక్కలను పెంచుతున్నారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపుల మొక్కల పెంపకం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రతీ వీధిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందించడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అనేక రంగాల్లో అభివృద్ధి
ప్రజలు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్ని విధా లుగా అభివృద్ధి చేసుకుంటు న్నాం. రెండేళ్లుగా పల్లెప్రగతితో గ్రామంలో అనేక రంగాల్లో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రభుత్వం సూచించిన్నట్లుగా పల్లెప్రగతిలో భాగంగా ఇప్పటికే వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, కంపోస్టుయార్డు, డంపింగ్యార్డు, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను పూర్తి చేశాం.
-బల్వంత్రెడ్డి సర్పంచ్ దాతాపూర్
అందరూ సహకరిస్తున్నారు..
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయ డానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలి. చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడంతో పాటు స్వచ్ఛతకు ప్రాధా న్యత ఇస్తున్నాం.