చర్లపల్లి, జనవరి 25 : చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీలు, సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్ అన్నారు. మంగళ వారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, జైళ్ల శాఖ ప్రవేశపెట్టిన సంస్కరణలను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు పాల్గొన్నారు.