ముంబై: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పత్రాచాల్ రీడెవలప్మెంట్ స్కీమ్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో కొన్ని కోట్ల మనీల్యాండరింగ్ ద్వారా చేతులు మారాయి. గోరేవాగ్ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. వర్షా అకౌంట్లోకి కూడా భారీ మొత్తంలో డబ్బు డిపాజిట్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వర్షాకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. పీఎంసీ బ్యాంక్ స్కామ్ కేసులోనూ ఈ ఏడాది జనవరిలో వర్షా రౌత్ను ఈడీ ప్రశ్నించింన విషయం తెలిసిందే. మాధురి ప్రవిణ్ రౌత్ అకౌంట్ నుంచి వర్షా అకౌంట్లోకి 55 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ కేసులో విచారణ జరిగింది. మరో వైపు ఆగస్టు 8వ తేదీ వరకు సంజయ్ కస్టడీని ముంబై కోర్టు పొడిగించింది.