దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ టెన్నిస్ చాంపియన్షిప్ డబ్ల్యూటీఏ -500 టోర్నీ క్వార్టర్స్కు దూసుకెళ్లింది. వైల్డ్ కార్డుతో బరిలోకి దిగిన సానియా తన సహచరి లూసీ హడెకాతో (చెక్ రిపబ్లిక్) జతకట్టి 7-6, 5-7, 11-9తో చాన్ హో చింగ్ (చైనా)-డెమి చర్స్ (నెదర్లాండ్స్) జోడీని చిత్తు చేసింది. తొలి సెట్లో ఆధిక్యం ప్రదర్శించిన సానియా జంట రెండో సెట్ను చేజార్చుకుంది. నిర్ణయాత్మక ఆఖరి సెట్లో విజృంభించి మ్యాచ్ను సొంతం చేసుకుని ముందంజ వేసింది.