పినపాక : మండలంలోని ఏడూళ్ళబయ్యారం పెద్దవాగులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు ఇసుక లారీలు, ఒక జేసీబీని ఆదివారం అర్థరాత్రి ఏడూళ్ళబయ్యారం పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. సీఐ దోమల రమేష్ మాట్లాడుతూ.. ఏడూళ్ళబయ్యారం అడ్డరోడ్కు చెందిన రెండు టిప్పర్లు, ఓ జేసీబీ బయ్యారం పెద్దవాగులో అక్రమంగా తరలిస్తుండగా సిబ్బందితో వెళ్లి పట్టుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సంబంధిత యజమానులు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.